ఈ క్రమంలో సీనియర్లు చాలా మంది సైడ్ అయిపోయి జూనియర్లకు దారి ఇస్తే కొంతలో కొంత కొత్త ముఖాలు తెరపైకి వస్తాయి. రాజకీయ వారసులు ఉండనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిభా భారతి (మాజీ స్పీకర్ కూతురు) గ్మీష్మ రాజాం నుంచి, నరసన్నపేటలో ఎర్రన్నాయుడి తమ్ముడి కొడుకు సురేశ్, అదేవిధంగా ఎచ్చెర్లలో ఎర్రన్నాయుడి భక్తుడు కలిశెట్టి, కళావెంకట్రావు కొడుకు వీరేకాకుండా చీపురు పల్లి నుంచి టీడీపీ తరఫున కిమిడి గణపతి (మాజీ ఎమ్మెల్యే) కొడుకు కిమిడి నాగార్జున ఇలా చాల మంది కొత్త ముఖాలు వస్తున్నాయి. వీరిని ప్రోత్సహిస్తూనే తెలుగు యువతను బలోపేతం చేసే చర్యలు కూడా చంద్రబాబు చేపట్టున్నారు. తెలుగు యువతతో పాటు ఐ టీడీపీ (డిజిటల్ మీడియా వింగ్) ని కూడా బలోపేతం చేయనున్నారు. ఓ విధంగా పాత నీరు పోయి కొత్త నీరు వస్తే పార్టీ పరువు నిలబడుతుందన్న ఆలోచన, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారిని విస్మరించక వారికి పార్టీ లో అగ్ర తాంబూలం ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన అధినేత దగ్గర ఉంది. సీనియర్లు పార్టీకి సేవలు చేసే పనిలో నిమగ్నం అయి ఉంటే జూనియర్లు రణ క్షేత్రంలో పనిచేసేందుకు సులువు అవుతుంది.
ఈ క్రమంలో సీనియర్లు చాలా మంది సైడ్ అయిపోయి జూనియర్లకు దారి ఇస్తే కొంతలో కొంత కొత్త ముఖాలు తెరపైకి వస్తాయి. రాజకీయ వారసులు ఉండనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిభా భారతి (మాజీ స్పీకర్ కూతురు) గ్మీష్మ రాజాం నుంచి, నరసన్నపేటలో ఎర్రన్నాయుడి తమ్ముడి కొడుకు సురేశ్, అదేవిధంగా ఎచ్చెర్లలో ఎర్రన్నాయుడి భక్తుడు కలిశెట్టి, కళావెంకట్రావు కొడుకు వీరేకాకుండా చీపురు పల్లి నుంచి టీడీపీ తరఫున కిమిడి గణపతి (మాజీ ఎమ్మెల్యే) కొడుకు కిమిడి నాగార్జున ఇలా చాల మంది కొత్త ముఖాలు వస్తున్నాయి. వీరిని ప్రోత్సహిస్తూనే తెలుగు యువతను బలోపేతం చేసే చర్యలు కూడా చంద్రబాబు చేపట్టున్నారు. తెలుగు యువతతో పాటు ఐ టీడీపీ (డిజిటల్ మీడియా వింగ్) ని కూడా బలోపేతం చేయనున్నారు. ఓ విధంగా పాత నీరు పోయి కొత్త నీరు వస్తే పార్టీ పరువు నిలబడుతుందన్న ఆలోచన, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారిని విస్మరించక వారికి పార్టీ లో అగ్ర తాంబూలం ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదన అధినేత దగ్గర ఉంది. సీనియర్లు పార్టీకి సేవలు చేసే పనిలో నిమగ్నం అయి ఉంటే జూనియర్లు రణ క్షేత్రంలో పనిచేసేందుకు సులువు అవుతుంది.