ఈశాన్య రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. ఇది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ప్రభావితం చేసేలా ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఓటింగ్కు వెళ్లిన ఈశాన్య రాష్ట్రాలైన అసోమ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కూడా కమలం పార్టీతో పాటు దాని మిత్ర పక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అసోం రాష్ట్రంలో అయితే హస్తం పార్టీ మరీ దారుణంగా ఉంది. కనీసం డిపాజిట్లు కూడా కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2022లో జరిగే మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిందే. 2017లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ... బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో... కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు హస్తం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.
ఈశాన్య రాష్ట్రాల ఉప ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్ర పక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. ఇది మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ప్రభావితం చేసేలా ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఓటింగ్కు వెళ్లిన ఈశాన్య రాష్ట్రాలైన అసోమ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కూడా కమలం పార్టీతో పాటు దాని మిత్ర పక్షాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోయింది. అసోం రాష్ట్రంలో అయితే హస్తం పార్టీ మరీ దారుణంగా ఉంది. కనీసం డిపాజిట్లు కూడా కష్టమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2022లో జరిగే మణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయితే గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిందే. 2017లో ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ... బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో... కాంగ్రెస్ నుంచి వలసలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు హస్తం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది.