ఈ అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆరోగ్య శాఖతో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకుని చర్చించారు. అవసరమైతే లాక్ డౌన్ ప్రకటించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కరోనా అయితే మనం వేసుకున్న టీకా ద్వారా శరీరంలో యాంటీ బాడీస్ పెరిగితే అరికట్టే అవకాశం ఉంది. కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం యాంటీ బాడీస్ వల్ల తగ్గేది కాదని చెబుతున్నారు కొందరు వైద్య నిపుణులు. అయితే ప్రపంచ దేశాలలో పలు చోట్ల ఈ కొత్త వేరియంట్ ఉన్నప్పటికీ దీని కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా లేక పోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇక కరోనా థర్డ్ వేవ్ కి ఇదే సూచకమా? కరోనా మూడవ దశ నిజంగా ఉందా? అన్న స్పష్టత మాత్రం ఇంకా శాస్త్రజ్ఞులు ఖచ్చితంగా తేల్చి చెప్పలేక పోతున్నారు. ఇటువంటి సందిగ్ధంలో దేశం లోకి ఒమిక్రాన్ వేరియంట్ రాక సర్వత్రా భయాందోళనలు కలిగిస్తోంది. అయితే ఒక ఖచ్చితమైన అభిప్రాయం రావడానికి ఇంకో మూడు వారాల పాటు సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.