ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. జిల్లాల పర్యటకు వెళ్లిన సమయంలో కూడా సాధ్యమైనంత వరకు రోడ్డు మార్గంలోనే ప్రయాణించే వారు. 2010లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో కొణిజేటి రోశయ్య హెలికాఫ్టర్ను దూరంగానే ఉంచారు. ముందుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి పూళ్ల గ్రామం వరకు మాత్రమే హెలికాఫ్టర్ ప్రయాణం. అక్కడి నుంచి కూడా కారులోనే తన పర్యటన కొనసాగించారు రోశయ్య. సాయంత్రం పూట విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో వెళ్దామని సహచర మంత్రులు చెప్పినప్పటికీ... అంత త్వరగా మనం వెళ్లి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని చమత్కరించారు. చివరికి ఏలూరు పట్టణం నుంచి ప్రత్యేక రైలులో హైదరాబాద్ పయనమయ్యారు. రాత్రి పూట హాయిగా పడుకుని వెళితే చాలు కదా... ఎందుకు తొందర అని అనేశారు.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. జిల్లాల పర్యటకు వెళ్లిన సమయంలో కూడా సాధ్యమైనంత వరకు రోడ్డు మార్గంలోనే ప్రయాణించే వారు. 2010లో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో కొణిజేటి రోశయ్య హెలికాఫ్టర్ను దూరంగానే ఉంచారు. ముందుగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రత్యేక విమానంలో వచ్చారు. అక్కడి నుంచి పూళ్ల గ్రామం వరకు మాత్రమే హెలికాఫ్టర్ ప్రయాణం. అక్కడి నుంచి కూడా కారులోనే తన పర్యటన కొనసాగించారు రోశయ్య. సాయంత్రం పూట విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో వెళ్దామని సహచర మంత్రులు చెప్పినప్పటికీ... అంత త్వరగా మనం వెళ్లి చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని చమత్కరించారు. చివరికి ఏలూరు పట్టణం నుంచి ప్రత్యేక రైలులో హైదరాబాద్ పయనమయ్యారు. రాత్రి పూట హాయిగా పడుకుని వెళితే చాలు కదా... ఎందుకు తొందర అని అనేశారు.