ఇప్పుడు తాజాగా భారత్లో కూడా రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చితే... భారత్ చాలా మేలు. అయితే పెరిగే ప్రమాదం లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు కూడా. అయితే బెంగళూరులో నిర్వహించిన ఓ అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల కాన్ఫరెన్స్... ఓమిక్రాన్ వేరియంట్ సూపర్ స్ప్రెడర్గా మారేందుకు కారణమని ఆందోళన చెందుతున్నారు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఓ డాక్టర్ ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు. కేవలం ఇంటర్ నేషనల్ డాక్టర్స్ కాన్ఫరెన్స్లో మాత్రమే ఆయన పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. నవంబర్ 19, 20, 21వ తేదీల్లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిని ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ దీన్ని నిర్వహించింది.
ఇప్పుడు తాజాగా భారత్లో కూడా రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చితే... భారత్ చాలా మేలు. అయితే పెరిగే ప్రమాదం లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు కూడా. అయితే బెంగళూరులో నిర్వహించిన ఓ అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల కాన్ఫరెన్స్... ఓమిక్రాన్ వేరియంట్ సూపర్ స్ప్రెడర్గా మారేందుకు కారణమని ఆందోళన చెందుతున్నారు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఓ డాక్టర్ ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు. కేవలం ఇంటర్ నేషనల్ డాక్టర్స్ కాన్ఫరెన్స్లో మాత్రమే ఆయన పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. నవంబర్ 19, 20, 21వ తేదీల్లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిని ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ దీన్ని నిర్వహించింది.