రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నంలో భాగంగా కొన్ని కొన్ని సమస్యలను భుజానికెత్తుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే కొన్ని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడటం లేదు. కడప జిల్లాలో భారీ వరదలు వస్తే ప్రధానంగా మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సమాధానం ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.
ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లా తో పాటుగా నెల్లూరకు అలాగే కడప జిల్లాలో భారీ వర్షాలు అదేవిధంగా వరదలు చుక్కలు చూపించాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లి ప్రజల్లో ఉండటమే కాకుండా విపక్షాలు చేసే కొన్ని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి ఉందా సరే వైసీపీ ఎమ్మెల్యే లు ఏమీ మాట్లాడకపోవటంతో జగన్ కూడా కాస్త ఒత్తిడి ఫీలవుతున్నారని ప్రధానంగా అసలు ఏం మాట్లాడని ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు.మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.