తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్యను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది పసుపు పెద్దల ఆరోపణ. ఇది అవునో కాదో తెలియడమో నిర్థారణ జరగడమో కావాలి. కానీ ఆ తరువాత కూడా వ్యాఖ్యలకు అనుగుణంగా మరికొంత రచ్చ జరిగింది. మీడియా కేంద్రంగా వంశీ వల్లభనేని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం తరువాత క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ జరగాల్సిన నష్టం వైసీపీకి ఎప్పుడో జరిగిపోయింది. దీంతో పరువు పోగొట్టుకున్నాక నష్ట నివారణ చర్యలకు దిగి ఏం లాభం అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. దీంతో నిన్నటి వేళ కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భువనేశ్వరి కాళ్లు తమ కన్నీళ్లతో కడుగుతాం అని అంటున్నారు. ఇదంతా రాజకీయంగా మైలేజీ పెంచుకునేందుకేనా లేదా నిజంగానే వైసీపీలో రియలైజేషన్ వచ్చిందా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్యను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది పసుపు పెద్దల ఆరోపణ. ఇది అవునో కాదో తెలియడమో నిర్థారణ జరగడమో కావాలి. కానీ ఆ తరువాత కూడా వ్యాఖ్యలకు అనుగుణంగా మరికొంత రచ్చ జరిగింది. మీడియా కేంద్రంగా వంశీ వల్లభనేని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం తరువాత క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ జరగాల్సిన నష్టం వైసీపీకి ఎప్పుడో జరిగిపోయింది. దీంతో పరువు పోగొట్టుకున్నాక నష్ట నివారణ చర్యలకు దిగి ఏం లాభం అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. దీంతో నిన్నటి వేళ కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భువనేశ్వరి కాళ్లు తమ కన్నీళ్లతో కడుగుతాం అని అంటున్నారు. ఇదంతా రాజకీయంగా మైలేజీ పెంచుకునేందుకేనా లేదా నిజంగానే వైసీపీలో రియలైజేషన్ వచ్చిందా?