ఇప్పుడు ఇదే విషయం జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపుతోంది కూడా. కేవలం అకాల వరద కారణంగానే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోయాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వాదిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిందంటూ లోక్సభలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అటు ఆత్మరక్షణలో పడిన వైసీపీ సర్కార్... కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని స్వయంగా మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారని ఎదురు దాడి చేశారు. జరిగిన తప్పు గురించి కేంద్ర మంత్రి దగ్గర కనీస సమాచారం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఎదురుదాడి మొదలు పెట్టారు. కేంద్రాన్ని తప్పుబడితే ఇబ్బందులు తప్పవంటూ ఎంపీ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చేశారు.
ఇప్పుడు ఇదే విషయం జాతీయ స్థాయిలో పెద్ద దుమారం రేపుతోంది కూడా. కేవలం అకాల వరద కారణంగానే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోయాయని ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వాదిస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు తెరలేపింది. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిందంటూ లోక్సభలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అటు ఆత్మరక్షణలో పడిన వైసీపీ సర్కార్... కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని స్వయంగా మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారని ఎదురు దాడి చేశారు. జరిగిన తప్పు గురించి కేంద్ర మంత్రి దగ్గర కనీస సమాచారం కూడా లేదంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఎదురుదాడి మొదలు పెట్టారు. కేంద్రాన్ని తప్పుబడితే ఇబ్బందులు తప్పవంటూ ఎంపీ జీవీఎల్ వార్నింగ్ ఇచ్చేశారు.