దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు అవివాహిత గానే తన జీవిత ప్రయాణాన్ని గడిపారు. అయితే ఈమెకు దత్తత పుత్రుడు ఉన్నాడన్న విషయం తెలిసిందే. ఆయన పెళ్లిని 1996 లో అంగరంగ వైభవంగా ఒక రాజకుమారుడు వివాహం అంత వైభవంగా చేయడంతో అందరి దృష్టి ఆమె ఆస్తిపాస్తులపై పడింది. ఆ తరవాత కొద్ది రోజులకు అధికారులు చేసిన సోదాల్లో బయటపడ్డ ఆమె సంపదను చూసి అంతా అవాక్ అయిపోయారు. అనంతరం ఆమె అక్రమాస్తుల కేసుపై జైలు శిక్ష కూడా అనుభవించారు. జైలు నుండి రిలీజ్ అయిన తరవాత ఆమె జీవన శైలిలో పెను మార్పు చోటు చేసుకుంది.
అప్పటి వరకు మహారాణిలా బ్రతికిన ఆమె జైలు శిక్ష తరవాత చాలా సాదాసీదాగా జీవించారు. కేవలం రెండు రంగుల సాధారణమైన చీరల్లోనే ఆమె కనిపించేవారు. నగలు ఏమాత్రం పెట్టుకునే వారు కాదు. కానీ ఆమె వేద నిలయంలో మాత్రం కేజీల కొద్ది బంగారం, వెండి, వందల కొద్దీ చొప్పుల జతలు ఒకటి కాదు అన్ని రకాల లగ్జరీ ఫర్నిచర్ ఇలా రాజభవనాలకు మించి ఆడంబరంగా ఉంది. ఇలా ఆమె జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి.