పాలన ఏదయినా పాలకులు ఏమయినా కానీ మన రాజకీయాల్లో తిరుగులేని నైజం ఉన్నా లేకున్నా కూడా కొన్ని జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి. ఎదురులేని మనిషి, మడమ తిప్పని మనిషి వగైరా వగైరా పదాలు మనం పలుకుబడికి తూగేవే కానీ పెద్దల పలుకుబడిని పెంచేవి అవునో కాదో చెప్పలేం కొన్నిసార్లు. తెలుగు దేశం నుంచి వలస పోయిన నాయకులు వైసీపీలో చక్రం తిప్పుతా ఉంటే, వైసీపీ నుంచి ఆ రోజు టీడీపీకి పోయిన నాయకులు పదవులు పొంది హాయిగా రాజకీయం నడిపిన వైనం గత కాల కథ అని అందరికీ విధితమే! మనం ఏం చెప్పినా చెప్పకున్నా పార్టీని నమ్ముకుని కడదాకా రాజకీయం చేయడంలో అర్థం లేదు అన్నది ఇప్పటి వాదన. ఒకే పార్టీని అని రాయాలి. అవును.. ఎందుకంటే రాజకీయం వలస పక్షులతోనే నిండిపోయి ఉంటుంది. గెలిచినవారిది రాజ్యం కనుక వారితోనే ఉండడంలో తప్పు కన్నా ఒప్పులు ఎక్కువ ఉన్నాయి అని మనం అనుకోవడం ఓ విధి. కాల కూటం లాంటి ఈ రాజకీయంను మనం శాసించలేం కనీసం మార్చలేం కూడా! కనుక మనం చూస్తూ ఉంటే జగన్ కోటరీలో వచ్చే మార్పులు విస్మయ భ్రాంతిని కలిగిస్తాయి. సందేహాస్పద పరిణామాలకు తావిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న వాళ్లంతా ఎగిరిపోయి ఎక్కడో వాలిపోయి స్వర్గ ధామ నిర్మాణాలకు వనరులు వెతుక్కుంటే ఈ జగన్ కానీ ఆ చంద్రబాబు కానీ ఏం చేస్తారని?
- రత్నకిశోర్ శంభుమహంతి