కొన్ని థియేటర్లను సీజ్ చేయించారు కూడా
అయినా బాలయ్య అభిమానులే కాదు
యావత్ సినిమా అభిమానులూ ఈ సినిమాకు
బ్రహ్మరథం పట్టారు..
ఏడాది చివర్లో ఎన్నో కష్టాలు దాటి వచ్చిన అఖండ సినిమా మంచి విజయం అందుకుంది. బాలయ్య మాస్ ఇమేజ్ ను మరింత రెట్టింపు చేసింది. చెప్పే కథలో లోపాలు, కథన రీతిలో లోపాలు ఉన్నా కూడా మంచి విజయమే అందుకుంది. ముఖ్యంగా మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలనూ అలరిస్తోంది. మంచి కలెక్షన్లు దక్కించుకున్న ఉత్సాహంలో సినిమా యూనిట్ ఉంది అంటే అందుకు కారణం సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు అందరినీ ఆకట్టుకుని తీరడం. ఒకటి బాలయ్య పెర్ఫార్మెన్స్ రెండు తమన్ సంగీతం మూడు ఎక్కడ బిగి సడలని రీతిలో ఫైట్స్.. ఇవే కాకుండా హీరోయిన్ ప్రజ్ఞా అదనపు ఆకర్షణ. అందుకే ఈ సినిమా ఆంధ్రా నైజాం సీడెడ్ ఏరియాల్లో మంచి కలెక్షన్ల సాధించి నిర్మాతకో బంపర్ బొనాంజాగా మారింది. సినిమా బాగుంటే అంతా ఆదరిస్తారు.
కనీస స్థాయిలో ఉన్నా కూడా వసూళ్ల వర్షం కురిపిస్తారు అని అనేందుకు ఈ సినిమానే పెద్ద ఉదాహరణ. ఏపీలో టికెట్ రేట్లు మార్చినా, కొన్ని నిబంధనలు విధించినా కూడా నిర్మాత ఎక్కడా తడబడలేదు. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సైతం పెద్దగా వ్యతిరేకించలేదు.
ముఖ్యంగా ఈ సినిమా విషయమై మొదట నుంచి విడుదలయిన టీజర్లూ ట్రైలర్లూ మంచి టాక్ తెచ్చుకోవడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. సినిమా గెలవాలి అన్న బోయపాటి నినాదం ఎంతగానో ప్రభావితం చేసింది. బన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి చెప్పిన మాటలు కూడా అందరినీ ఆకర్షించాయి. చిరంజీవి అభిమానులు అనేకాదు సినిమా అభిమానులు అందరికీ చాలా నచ్చేసింది ఈ సినిమా. కనుక నిన్నటి వీకెండ్ లో వర్షం సైతం లెక్క చేయక ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చేందుకు ఇష్టపడ్డారు. బాలయ్య వినిపించిన డైలాగ్స్, దేవాలయ ప్రాధాన్యం, హిందూ ధర్మం గొప్పతనం, చెట్టు తల్లి గొప్పతనం వీటిపై ఆయన పలికించిన మాటలు అన్నీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. రొటీన్ మాటలు కావవి. బాలయ్య మాత్రమే చెప్పగలిగే మాటలు. అంత బాగున్నాయి. సినిమా విజయంలో మంచి భాగం దక్కించుకున్నవే ఇవి. అందుకే ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ కు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.