అనంతరం ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వైసీపీలో చేరిన రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీ సీటు దక్కించు కున్నారు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా గెలిచిన కొద్దిరోజులకే జగన్ కు రఘు రామకు మధ్య గ్యాప్ పెరిగింది. చివరకు అది పెద్దది అవడంతో జగన్ రఘురామ ను పార్టీ నుంచి బహిష్కరించిన కుండా ఆయన ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలంటూ నేరుగా లోక్ సభభ స్పీకర్ ఓం బిర్లాకు తమ పార్టీ ఎంపీల చేత ఫిర్యాదు చేయించారు.
ఇక వచ్చే ఎన్నికల్లో రఘురామ కు ఎలాగూ వైసిపి సీటు దొరకదు. ఈ క్రమంలోనే ఆయన టిడిపిలోకి వెళతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రఘురామ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్న నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. రఘురామ ఇప్పుడు వైసీపీ లోనే ఉంటూ జగన్ పై చేస్తోన్న పోరాటానికి టీడీపీ వాళ్లు కూడా ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే నరసాపురం టీడీపీ ఎంపీ క్యాండెట్ అన్న చర్చలు టీడీపీ వర్గాల్లో కూడా జరుగుతున్నాయి. మరి రఘురామ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి.