జనసేన - టిడిపి పొత్తు ఉన్నచోట్ల రెండు పార్టీలు లాభం పొందాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీని చిత్తు చిత్తు చేయవచ్చు అన్నదే టిడిపి - జనసేన నాయకులు అభిప్రాయంగా కనిపిస్తోంది. జనసేన - టిడిపి పొత్తు పెట్టుకుంటే 2024 ఎన్నికల్లో వైసీపీకి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా - గుంటూరు జిల్లాల్లో ఎదురుదెబ్బలు తప్పవని అంటున్నారు.
2014 ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లా లతో పాటు కృష్ణా - గుంటూరు జిల్లాల్లో వైసిపి చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మళ్లీ జనసేన టిడిపి కలిస్తే వైసీపీకి ఈ నాలుగు జిల్లాల్లో 2014 ఎన్నికల నాటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.
దీనికి తోడు రాజధాని కృష్ణా - గుంటూరు జిల్లాల్లో వైసీపీకి మరింత పెద్ద దెబ్బ తగులుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర లోనూ ఈ కాంబినేషన్ బలంగా పని చేస్తే అక్కడ కూడా అధికార పార్టీ కి షాకులు అయితే తప్పేలా లేవు.