టాలీవుడ్ లో ఉన్న దర్శకులలో మిగిలిన అందరి దర్శకుల కన్నా ఒక హీరోను మాస్ హీరోగా ప్రజెంట్ చేయాలంటే అది బోయపాటి శ్రీను వల్లే సాధ్యం అవుతుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా తనను మాస్ హీరోగా ప్రజెంట్ చేసుకునేందుకు బోయపాటి నే నమ్ముకున్నాడు. ల్లుఅర్జున్ అప్పటివరకు క్లాసు సినిమాలు చేసుకుంటూ వచ్చి అప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సరైనోడు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. సరైనోడు సినిమా రిలీజ్ అయిన వెంటనే బన్నీని ఊర మాస్ పాత్రలో ఎవరు ఊహించుకోలేదు.

అయితే ఆ సినిమా బన్నీ కెరీర్ లోనే అప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమా ప్లాప్ అయినా కూడా వసూళ్ళ పరంగా మాత్రం నిరాశ పరచలేదు. ఇక ఇప్పుడు బోయపాటి బాలయ్య తో చేసిన మూడో సినిమా అఖండ‌ కూడా అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ అగ్రహీరో ల క‌న్ను మళ్లీ బోయ‌పాటి పై పడింది.

ఇక సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే బోయపాటి లోని ఊరమాస్ టాలెంట్ కు మెగాస్టార్ ఇప్పుడు ఫిదా అయిపోయారు. వాస్తవానికి బోయపాటి - చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే వినయ విధేయ రామ ప్లాప్ అవడంతో ఈ సినిమా వెనక్కు వెళ్ళింది.

ఇప్పుడు అఖండ చూసిన చిరంజీవి మళ్ళీ బోయపాటి తో అదిరిపోయే ఒక సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: