స్థలం రూపంలో అయినా లేదా డబ్బు రూపంలో నా అన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇష్టం అని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసే ప్రైవేట్ వెంచర్ల లో 5 శాతం కమీషన్ జగనన్న కాలనీలకు ఇవ్వాలన్నది ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. అయితే ఈ ఐదు శాతం కమిషన్ అనేది వాళ్ళు వేసే ప్రైవేటు వెంచర్ ల లో అయినా ఇవ్వచ్చు ... లేదా బయట మరో చోట అయినా ఇవ్వవచ్చన్న రూల్ పెట్టినట్టు తెలుస్తోంది.
రియల్ ఎస్టేట్ లో వెంచర్లు వేయాలంటే రోడ్లు ఇతర అవసరాలు, పార్కులకు స్థలం వదులుతారు. అయితే ఇప్పుడు అదనంగా మరో ఐదు శాతం అదనంగా భూమి వదిలేయాల్సి ఉంటుంది. ఈ భూమిలో జగనన్న కాలనీ ఇళ్లు ఇస్తారు. లేదా స్థలం ప్రాథమిక విలువ పై కనీసం 5 % డబ్బు అయినా సరే ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది.
అంటే ప్రతి వెంచర్ లో 10 శాతం సామాజిక అవసరా ల కోసం కేటాయిస్తోన్న దానికి అదనంగా మరో 5 శాతం స్థలం వదలాల్సి ఉంది. ఇక రోడ్లు, ఇతర అవసరాల కు ఇచ్చే భూమి కూడా వదిలేస్తే.. అప్పుడు మొత్తం వెంచర్ లో 50 % భూమి లో కూడా ప్లాట్లు వేసే ఛాన్సులు ఉండవని అంటున్నారు.