అయితే మూడేళ్లలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో 128 చొరబాట్లు జరిగినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యధికంగా 17 వందల 87 చొరబాట్లు జరిగాయన్నారు. నేపాల్ సరిహద్దుల్లో కేవలం 25 చొరబాట్లు, మయన్మార్ సరిహద్దుల్లో 133 చొరబాట్లు జరిగినట్లు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి నితీశ్. చైనా, భూటాన్ సరిహద్దుల్లో మాత్రం మూడేళ్లలో ఎలాంటి చొరబాట్లు చోటు చేసుకోలేదన్నారు. సరిహద్దు రక్షణ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగటం లేదన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు మరింత పటిష్టం చేశామన్నారు. నిఘా పెంపుతో పాటు నిరంతర గస్తీ కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి. అరుణాచల్ ప్రదేశ్ విషయంపై చైనా వాదనను మరోసారి తోసి పుచ్చింది. చైనా ఆర్మీ దాదాపు వంద అశ్వ దళాలతో చొరబాటుకు యత్నించిన అంశం పెద్ద దుమారం రేపింది. కానీ అలాంటిది ఏమీ లేదని కేంద్రం చెబుతోంది. భారత్ - చైనా మధ్య పలు మార్లు సైనికాధికారుల చర్చలు జరిగినా కూడా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే మూడేళ్లలో భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో 128 చొరబాట్లు జరిగినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అత్యధికంగా 17 వందల 87 చొరబాట్లు జరిగాయన్నారు. నేపాల్ సరిహద్దుల్లో కేవలం 25 చొరబాట్లు, మయన్మార్ సరిహద్దుల్లో 133 చొరబాట్లు జరిగినట్లు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి నితీశ్. చైనా, భూటాన్ సరిహద్దుల్లో మాత్రం మూడేళ్లలో ఎలాంటి చొరబాట్లు చోటు చేసుకోలేదన్నారు. సరిహద్దు రక్షణ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగటం లేదన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు మరింత పటిష్టం చేశామన్నారు. నిఘా పెంపుతో పాటు నిరంతర గస్తీ కొనసాగుతుందన్నారు కేంద్ర మంత్రి. అరుణాచల్ ప్రదేశ్ విషయంపై చైనా వాదనను మరోసారి తోసి పుచ్చింది. చైనా ఆర్మీ దాదాపు వంద అశ్వ దళాలతో చొరబాటుకు యత్నించిన అంశం పెద్ద దుమారం రేపింది. కానీ అలాంటిది ఏమీ లేదని కేంద్రం చెబుతోంది. భారత్ - చైనా మధ్య పలు మార్లు సైనికాధికారుల చర్చలు జరిగినా కూడా ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.