మారుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేరుగా ఆ మాట చెప్పలేకపోయినా ఆ అర్థంకు దగ్గరగా ఉండేవిధంగా మాట్లాడుతూ, ఉద్యోగి డిమాండ్ మంచిదే న్యాయపరమైనదే కానీ మేం తీర్చలేం అనే చెబుతోంది. ఇప్పటికిప్పుడు కొత్త వేతన సవరణ తీసుకుని రాలేం అని కూడా స్పష్టం చేస్తోంది. ఆ విధంగా చేయాలం టే కొంత గడువు ఇవ్వాలని కోరుతోంది. ఇదే నిన్నటి వేళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే ఉద్యోగ సం ఘాల ప్రతినిధుల మాట మాత్రం మరో విధంగా ఉంది. తాము తల్చుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తామని, తమ దగ్గర అరవై లక్షల ఓట్లు ఉన్నాయని అంటున్నారు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు.
మారుతున్న ఆర్థిక పరిణామాల నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. నేరుగా ఆ మాట చెప్పలేకపోయినా ఆ అర్థంకు దగ్గరగా ఉండేవిధంగా మాట్లాడుతూ, ఉద్యోగి డిమాండ్ మంచిదే న్యాయపరమైనదే కానీ మేం తీర్చలేం అనే చెబుతోంది. ఇప్పటికిప్పుడు కొత్త వేతన సవరణ తీసుకుని రాలేం అని కూడా స్పష్టం చేస్తోంది. ఆ విధంగా చేయాలం టే కొంత గడువు ఇవ్వాలని కోరుతోంది. ఇదే నిన్నటి వేళ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పారు. అయితే ఉద్యోగ సం ఘాల ప్రతినిధుల మాట మాత్రం మరో విధంగా ఉంది. తాము తల్చుకుంటే ప్రభుత్వాలనే కూల్చేస్తామని, తమ దగ్గర అరవై లక్షల ఓట్లు ఉన్నాయని అంటున్నారు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు.