రాబోయే ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవాలని ఆశపడుతోంది. మరోవైపు కాంగ్రెస్ ఈ సారి ఎలాగైన తన ప్రభావం చూపి తిరిగి పాత ఫామ్లోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. ఎస్పీ, బీఎస్పీ ఇతర పార్టీలు కూడా ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికలపై సర్వేలు కొనసాగుతున్నాయి. యూపీ ప్రజలు ఎవరికి పట్టం కాట్టాలనుకుంటున్నారు..? ఈసారి సీఎం సీటుపై ఎవరు కూర్చుంటారు.? అనే విషయాలపై పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి ప్రజల పల్స్ పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఏబీపీ సీఓటర్ సర్వే సంస్థ చేసిన సర్వేలో యోగి మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వెల్లడించింది. 44 శాతం మంది ప్రజలు యోగిని సీఎంగా చేసేందుకు మద్ధతు ప్రకటించారు.