వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మరోసారి టీడీపీ అధినేత మరియు వారి అనుకూల మీడియా పై విరుచుకుపడ్డారు. పచ్చ మీడియా పడిపోయిన పార్టీకి ప్రాణం పోయాలని అనవసర ప్రయత్నం చేస్తుంది. ఎన్ని చేసినా మరోసారి బాబును నమ్మి మోసపోవడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు. నాడు ఎదో చేస్తారు అని ఆశపడి అధికారం ఇస్తే, దానిని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి చేయడం చేతకాలేదు. అప్పటి తప్పులకు ఇంకా శిక్ష అనుభవిస్తూ అది కూడా ప్రజలపై నెట్టే గొప్ప తనం బాబుది. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా, ఎంత విషప్రచారం చేసినా, ప్రభుత్వం ఏమి చేస్తుంది, ఆయన ఏమి చేస్తుంది ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. దానికి తగ్గట్టే ఫలితాలు కూడా ఇస్తూనే ఉన్నారు. అయినా ఇంకా ఏదో ఉండనే భ్రమలోనే బాబుగారు, ఆయన మీడియా డప్పుకొట్టుకోవడం విచిత్రం.

నిజమైన విమర్శలు చేస్తే ఏ ప్రభుత్వం స్వాగతించాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అలాంటివి ఏమైనా చేశారా అంటే ఒక్కటి ఉండదు. అన్నీ లేనిపోని ప్రచారాలు చేయడం ద్వారా సృష్టించిన విమర్శలే ఉన్నాయి. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే సొంత నియోజక వర్గం నుండి కూడా తరిమేశారు. దానిని బట్టి అయినా ఆయన అర్ధం చేసుకొని ఉండాలి, అలాంటివి ఆయనకు అలవాటు లేదు కాబట్టి ఇలా ఉన్నాడు. ఆ బాధ్యత ఆయన పచ్చ మీడియా తీసుకోని, లేనిపోని తిప్పలు పడుతూ, ప్రభుత్వం పై వీలైనంత విషప్రచారం చేస్తుంది. ఎవరు ఎన్ని అన్నప్పటికీ ప్రభుత్వం చేయాలి అనుకున్నది చేసి తీరుతుంది.

ఆయా బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏమేమి ఇవ్వాలని ఆయా పధకాలు ప్రవేశపెట్టిందో అవన్నీ వారందరికీ అందించడం జరుగుతుంది. ఎవరు ఎన్ని అడ్డు పుల్లలు వేసినప్పటికీ అవన్నీ సక్రమంగా లబ్దిదారులకు ఆడిస్తాం, ఆ నమ్మకం సీఎం జగన్ గారికి ఉంది, మాకు ఉంది. పేదల నోటికాడి కూడు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు కూడా స్పష్టంగా తెలుసుకుంటున్నారు, మాకు అది చాలు. వాళ్ళే తగిన తీర్పు ఇవ్వడం ద్వారా ఎవరికి చెప్పాల్సిన బుద్ధి వాళ్లకు చెపుతారు. ప్రభుత్వం మాత్రం పధకాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: