తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు కంకణం కట్టుకున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ కాషాయ నేతలతో కీలక సమావేశం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ బండి సంజయ్కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా రేపు ఉదయం హస్తినలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమాటివేశం కానున్నారు. రాష్ట్రంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు.. రాష్ట్ర రాజకీయాలు, ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ రాసిన లేఖలపై కూడా అమిత్ షా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా కేంద్ర పెద్దలు రెడీ అయ్యారు. పార్టీలో ఈటల రాజేందర్కు ప్రాధాన్యత పెంచేందుకు అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ స్థాయి నేతలు కంకణం కట్టుకున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ కాషాయ నేతలతో కీలక సమావేశం నిర్వహించాలని హై కమాండ్ నిర్ణయించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ బండి సంజయ్కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కూడా రేపు ఉదయం హస్తినలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో సమాటివేశం కానున్నారు. రాష్ట్రంలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రతో పాటు.. రాష్ట్ర రాజకీయాలు, ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ రాసిన లేఖలపై కూడా అమిత్ షా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలో మార్పులు చేర్పులు చేసేందుకు కూడా కేంద్ర పెద్దలు రెడీ అయ్యారు. పార్టీలో ఈటల రాజేందర్కు ప్రాధాన్యత పెంచేందుకు అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.