ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిన కేంద్ర ప్రభుత్వం... 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను సాకుగా చూపించింది. అయితే విభజన హామీల్లో భాగంగా .... ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని ప్రకటించింది. హోదాకు సమానమైనదే ప్యాకేజీ అని నాటి కేంద్ర మంత్రి ప్రకటించారు. అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని నిండు సభలో చెప్పిన కేంద్ర పెద్దలు... అదే సమయంలో జమ్ము రాష్ట్రాన్ని మాత్రం స్పెషల్ స్టేటస్ స్టేట్ అంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు... ఇప్పుడు కనీసం ఆ మాట కూడా ఎత్తడం లేదు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది. కేంద్రం మెడలు వంచుతామని కూడా జగన్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నా కూడా... కనీస ప్రస్తావన లేదు. గతంలో మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించిన పదేళ్లలో ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి కావస్తుంది. మరో రెండేళ్లు గడిస్తే... హోదాపై మాట్లాడే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండదు. అంటే హోదా హుళక్కేనా....!
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిన కేంద్ర ప్రభుత్వం... 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను సాకుగా చూపించింది. అయితే విభజన హామీల్లో భాగంగా .... ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇస్తామని ప్రకటించింది. హోదాకు సమానమైనదే ప్యాకేజీ అని నాటి కేంద్ర మంత్రి ప్రకటించారు. అసలు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని నిండు సభలో చెప్పిన కేంద్ర పెద్దలు... అదే సమయంలో జమ్ము రాష్ట్రాన్ని మాత్రం స్పెషల్ స్టేటస్ స్టేట్ అంటూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేసిన ఏపీ ఎంపీలు... ఇప్పుడు కనీసం ఆ మాట కూడా ఎత్తడం లేదు. గతంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై పోరాటం చేసింది. కేంద్రం మెడలు వంచుతామని కూడా జగన్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నా కూడా... కనీస ప్రస్తావన లేదు. గతంలో మన్మోహన్ ప్రభుత్వం ప్రకటించిన పదేళ్లలో ఇప్పటికే 8 ఏళ్లు పూర్తి కావస్తుంది. మరో రెండేళ్లు గడిస్తే... హోదాపై మాట్లాడే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండదు. అంటే హోదా హుళక్కేనా....!