వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్లను కలుపుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం హడావుడి ప్రకటన 2018లో చేసింది. కానీ ఇప్పుడు సరిగ్గా మూడేళ్ల తర్వాత ప్లేటు ఫిరాయించింది. దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కూడా లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. వారం రోజుల క్రితం డిసెంబర్ ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జోన్ కోసం 40 లక్షల రూపాయలు కేటాయించామని ప్రకటించిన మంత్రి... మొత్తం 170 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేసినట్లు కూడా వెల్లడించారు. కానీ వారం రోజుల తర్వాత మాత్రం అసలు జోన్ సాధ్యం కాదని తేల్చేశారు. గతంలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన ఏపీ ఎంపీలు... కనీసం ఈ ప్రకటన సమయంలో సభలో కూడా కనిపించలేదు. ప్రత్యేక రైల్వే జోన్ వస్తే... అటు ఆదాయం పెరుగుతుందని... అదే సమయంలో ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ ఇవేవీ లేవని కేంద్రం తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం.
వాల్తేరు డివిజన్, విజయవాడ డివిజన్, గుంటూరు డివిజన్, గుంతకల్ డివిజన్లను కలుపుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం హడావుడి ప్రకటన 2018లో చేసింది. కానీ ఇప్పుడు సరిగ్గా మూడేళ్ల తర్వాత ప్లేటు ఫిరాయించింది. దేశంలో ప్రస్తుతం 17 రైల్వే జోన్లు ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే అవకాశమే లేదని కూడా లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. వారం రోజుల క్రితం డిసెంబర్ ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జోన్ కోసం 40 లక్షల రూపాయలు కేటాయించామని ప్రకటించిన మంత్రి... మొత్తం 170 కోట్లు ఖర్చు అవుతుందని ఇప్పటికే అంచనా వేసినట్లు కూడా వెల్లడించారు. కానీ వారం రోజుల తర్వాత మాత్రం అసలు జోన్ సాధ్యం కాదని తేల్చేశారు. గతంలో విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన ఏపీ ఎంపీలు... కనీసం ఈ ప్రకటన సమయంలో సభలో కూడా కనిపించలేదు. ప్రత్యేక రైల్వే జోన్ వస్తే... అటు ఆదాయం పెరుగుతుందని... అదే సమయంలో ఉద్యోగావకాశాలు కూడా మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ ఇవేవీ లేవని కేంద్రం తేల్చేసింది కేంద్ర ప్రభుత్వం.