ఇక చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఓడించేందుకు వైసీపీ కంకణం కట్టుకుంది. అందుకే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కుప్పంలో పాగా వేసింది వైసీపీ. కుప్పం పురపాలికపై తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అటు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చంద్రమౌళి కుమారుడు భరత్ను ఎమ్మెల్సీ చేశారు జగన్. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ ఎన్నికల పోస్టుమార్టం సమయంలో కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని కూడా ప్రకటించారు. అది కూడా కేవలం పది నెలల్లోనే పూర్తి చేస్తారట. ఇకపై వీలైనన్ని ఎక్కువ రోజులు కుప్పంలోనే ఉంటానని తేల్చేశారు.
ఇక చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఓడించేందుకు వైసీపీ కంకణం కట్టుకుంది. అందుకే పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో కుప్పంలో పాగా వేసింది వైసీపీ. కుప్పం పురపాలికపై తొలిసారి వైసీపీ జెండా ఎగిరింది. అటు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ చంద్రమౌళి కుమారుడు భరత్ను ఎమ్మెల్సీ చేశారు జగన్. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి అనేలా పరిస్థితి మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. మునిసిపల్ ఎన్నికల పోస్టుమార్టం సమయంలో కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని కూడా ప్రకటించారు. అది కూడా కేవలం పది నెలల్లోనే పూర్తి చేస్తారట. ఇకపై వీలైనన్ని ఎక్కువ రోజులు కుప్పంలోనే ఉంటానని తేల్చేశారు.