ఒకరు వచ్చారు ఒకరు పిలిచారు
పిలిచిన అతిథికి కడుపు నిండా అన్నం పెట్టారు
ఆకలి తీర్చి సమస్యలు విని పంపారు
ఇక నిర్ణయం వెలువడడమే తరువాయి!
మరో రెండు మూడు వారాల్లోసమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు చిరంజీవి.ఇవాళ అమరావతిలో సీఎం జగన్ కు కలిశాక కొన్ని కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు.అవేంటో ఆయన మాటల్లోనే..చిత్ర సీమకు సంబంధించి అన్ని సమస్యలు వివరించాను.ముఖ్యంగా నిర్మాతల పరంగా,ఎక్జిబిషన్ రంగంలో ఉన్న వారి పరంగా తలెత్తుతున్న సమస్యలు వారికి చెప్పాను.పైకి కనిపించేంత గొప్ప ప్రపంచం అయితే ఇది కాదు..కరోనా సమయంలో అనేక అవస్థలు పడి కార్మికులు తిండికి గతిలేని రోజులున్నాయి. మేం మా తరఫున మూడు విడతలుగా కార్మికులను ఆదుకున్నాం.నిత్యావసర సరకులు అందించి వారికో చేయూత ఇచ్చాం. మీరు మా అందరి సమస్యలు పరిగణించి పరిష్కారం చూపాలి.. అని జగన్ ను వేడుకున్నానని అన్నారు.తరువాత బేటీ ఎప్పుడని అడిగితే ఆ నిర్ణయం కూడా సీఎందేనని అన్నారు.