అందుకే తెలంగాణ నుంచి ఎంతోమంది సంక్రాంతికి ఏపీ వెళ్లి అక్కడ కోళ్ల పందాలను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కోళ్ల పందాల లో ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు కూడా పాల్గొంటారన్నది ఎప్పుడూ వినిపించే మాట. ఇక ఈసారి కూడా సంక్రాంతి వచ్చేసింది. కోళ్ళ పందేలకు అంతా సిద్ధమైపోయింది. కోళ్ల పందాలు జరగకుండా చూసేందుకు పోలీసులు చర్యలు చేపడుతుంటే ఎలాగోలా పోలీసులకు తెలియకుండా కోళ్ల పందాల నిర్వహించేందుకు అందరూ సిద్ధమైపోయారు. ఇక ఈసారి కోస్తా జిల్లాల్లో కోళ్ల పందాల లో కాస్త టెక్నాలజీని జోడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఏకంగా సంక్రాంతికి గంగిరెద్దులు తీసుకువచ్చే హరిదాసు ఏకంగా గంగిరెద్దుకు ఒక క్యూఆర్ కోడ్ పెట్టడం ఇటీవలే చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇప్పుడు కోళ్ల పందాలలో కూడా ఇలాంటి టెక్నాలజీ జోడిస్తున్నారట. ఎక్కడినుంచైనా కోళ్ల పందాలను చూసేందుకు ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఏర్పాటు చేస్తున్నారట. అంతేకాదండోయ్ నేరుగా వెళ్లి బెట్టింగులు వేయాల్సిన అవసరం లేదు. కోళ్ల పందాలు పై ఆన్లైన్లోనే బెట్టింగులు వేసేందుకు కొన్ని వెబ్ సైట్స్ కూడా రూపొందించుకున్నారట. ఇక కోళ్ల పందాల పై ఆసక్తి ఉన్న వాళ్ళని వాట్సాప్ గ్రూపు లో చేర్చి కోళ్ల అమ్మకాలు కొనుగోలు లాంటివి కూడా చేయడం మొదలు పెట్టారట. ఇలా కోళ్ల పందాలు కూడా ఆన్లైన్ యుగంలోకి మారిపోయాయి అన్నది అర్ధమవుతుంది.