అయితే ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం ఉద్యోగ సంఘాల నేతల మెడకు ఉచ్చులా మారింది. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం చెప్పినట్లుగానే నేతలంతా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉద్యోగ సంఘాల నేతలను ఇరుకున పడేశాయి. పీఆర్సీ కారణంగా ఉద్యోగులకు జీతాలు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా రివర్స్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఏ నోటితో అయితే జగన్ సర్కార్పై ప్రశంసలు కురిపించారో... ఇప్పుడు అదే నోటితో ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... తమ సంఘం సభ్యుల నుంచే వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మా కోసం పోరాటం చేయని నేతలతో మాకు పనేంటి అనే విమర్శలు కూడా ప్రస్తుతం అన్ని సంఘాల నేతలపై వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెలత్తింది. దీంతో నిన్న మొన్నటివరకూ ప్రభుత్వాన్ని పొగిడిన నేతలే ఇప్పుడు సర్కార్ ను టార్గెట్ చేయక తప్పని పరిస్దితికి వచ్చేశారు.
అయితే ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారం ఉద్యోగ సంఘాల నేతల మెడకు ఉచ్చులా మారింది. ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నేతలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. కానీ ప్రభుత్వం చెప్పినట్లుగానే నేతలంతా వ్యవహరించారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉద్యోగ సంఘాల నేతలను ఇరుకున పడేశాయి. పీఆర్సీ కారణంగా ఉద్యోగులకు జీతాలు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా రివర్స్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు ఏ నోటితో అయితే జగన్ సర్కార్పై ప్రశంసలు కురిపించారో... ఇప్పుడు అదే నోటితో ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... తమ సంఘం సభ్యుల నుంచే వారిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మా కోసం పోరాటం చేయని నేతలతో మాకు పనేంటి అనే విమర్శలు కూడా ప్రస్తుతం అన్ని సంఘాల నేతలపై వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెలత్తింది. దీంతో నిన్న మొన్నటివరకూ ప్రభుత్వాన్ని పొగిడిన నేతలే ఇప్పుడు సర్కార్ ను టార్గెట్ చేయక తప్పని పరిస్దితికి వచ్చేశారు.