కృష్ణా జిల్లాలో పూర్తిగా వైసీపీ హవా ఉన్న విషయం తెలిసిందే...ఇంతకాలం టీడీపీ అడ్డాగా ఉన్న కృష్ణా ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారిపోతుంది. అయితే వైసీపీ కంచుకోటగా మారకుండా ఉండటానికి టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ధీటుగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. కానీ ఎలా చూసుకున్నా సరే కొన్ని నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలుగా మారిపోయినట్లే కనిపిస్తున్నాయి.
 
గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ, తిరువూరు, నూజివీడు నియోజకవర్గాలు ఉన్నాయి. వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అసలు ఈ మూడు నియోజకవర్గాలు ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలు...కానీ ఇప్పుడు వైసీపీ కంచుకోటలు. ఈ మూడు చోట్ల మళ్ళీ వైసీపీ హ్యాట్రిక్ కొట్టేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ మూడు చోట్ల టీడీపీ బలం పుంజుకోలేదు. గుడివాడలో కొడాలి నాని దెబ్బకు టీడీపీ అడ్రెస్ గల్లంతు అయ్యే పరిస్తితి. అసలు అక్కడ మళ్ళీ టీడీపీ కోలుకునే అవకాశాలు, కొడాలిని ఓడించే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే గుడివాడలో వైసీపీ హ్యాట్రిక్‌ని ఆపడం కష్టమే.

ఇటు తిరువూరులో ఎమ్మెల్యే రక్షణనిధి ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పాల్సిన పనిలేదు...అసలు ఇక్కడ 1999 తర్వాత టీడీపీ గెలవలేదు...ఇక భవిష్యత్‌లో కూడా గెలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎంతమంది ఇంచార్జ్‌లని మార్చిన తిరువూరులో వైసీపీ హ్యాట్రిక్ అడ్డుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. నూజివీడు విషయానికొస్తే..2009 వరకు టీడీపీకి అనుకూలమే..2014 నుంచే సీన్ రివర్స్ అయింది...నూజివీడు కాస్త వైసీపీ అడ్డాగా మారింది.

నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు...ఆయన బలం ముందు టీడీపీ సరిపోవడం లేదు. ఇక్కడ టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు గాని, పెద్దగా ఉపయోగం లేదు. మేకాకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నూజివీడులో వైసీపీ జెండా ఎగిరేలా ఉంది. మొత్తానికి ఈ మూడు చోట్ల వైసీపీ హ్యాట్రిక్ కొట్టేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: