అమెరికా అధ్యక్షుడు బైడెన్ పనితీరుపై అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆయన మానసిక పరిస్థితి అంత బాగా లేదని ఓ సర్వే ద్వారా వెల్లడయింది. వచ్చే ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయడానికి పనికిరాడని ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే రిపోర్ట్ వెల్లడించింది.  ప్రజాభిప్రాయాన్ని ఖండించిన బైడెన్ 2024 ఎన్నికల్లో తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్ అని ప్రకటించారు. బైడెన్ ను ప్రజలు తిరస్కరిస్తుంటే ఆయన ఉపాధ్యక్ష పదవికి సూచనలు చేయడం ఏంటని ఒక వర్గం ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 శాతం మంది బైడెన్ తిరిగి పోటీ చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.

 జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచిన నేపథ్యంలో ఆసక్తికరమైన సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్ ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ గ్రాఫ్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ఎన్ ఓఆర్ సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి. అధ్యక్ష బాధ్యతల సమర్థంగా నిర్వహిస్తున్నారని జో బైడెన్ కు అనుకూలంగా 43 శాతం మంది మాత్రమే ఓటేశారు. జూలై లో నిర్వహించిన ఇదే తరహా సర్వే లో  59% బైడెన్ అధ్యక్ష బాధ్యతల పై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ లో ఇది 50 శాతానికి పడిపోయింది. కరోనా నియంత్రణలోను బైడెన్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తమైంది. 45 శాతం మంది మాత్రమే కరోనాపై బైడెన్ పని తీరు సంతృప్తిగా ఉందని వ్యక్తం చేశారు. 2021 జూలైలో 66 శాతం, డిసెంబర్ లో 57 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉన్నారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు.

మరోవైపు 50 శాతం మంది మాత్రం బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో 37 శాతం మంది మాత్రమే బైడెన్ ను మెచ్చుకున్నారు. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పన్ను విధానాలు, ఆఫ్ఘాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడం  వంటి అంశాల వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది. బైడెన్ అధ్యక్షుడు అయ్యాక దేశం ఐకమత్యం సాధించిందని 16 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, అమెరికా మరింత విభజనకు గురైందని 43 శాతం మంది పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: