ఇటీవలి కాలంలో డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఎన్నో మిసైల్స్ అభివృద్ధి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారూ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే పదికిపైగా క్షిపణులను తయారుచేసి వాటికి ప్రయోగాల నిర్వహించి భారత అమ్ముల పొదిలో చేర్చింది డి ఆర్ డి ఓ. భారత్ తయారుచేసిన అద్భుతమైన క్షిపణుల లో బ్రహ్మోస్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. ఎంతో అద్భుతంగా బ్రహ్మోస్ అభివృద్ధి చేసిన భారత్ ఈ మిస్సైల్ ద్వారానే ఆయుధ వ్యాపారం కూడా చేపడుతూ ఉండటం గమనార్హం.
అయితే ఇప్పటికి బ్రహ్మోస్ లాంటి ఒక అద్భుతమైన మిసైల్ ను అభివృద్ధి చేసిన డిఆర్డిఓ ఇక ఇప్పుడు మరో సంచలన క్షిపణి అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది అని తెలుస్తోంది. ఇందులో పన్నెండు వేల కిలోమీటర్ల రేంజ్ లో అగ్ని అనే మిస్సైల్ ని అభివృద్ధి చేసిందట. దీనికి సంబంధించి ప్రయోగాలు వచ్చే నెలలో జరగబోతున్నాయట. అగ్ని 6 ఐసిబిఎం 80% ప్రపంచాన్ని కవర్ చేయ కలిగినటువంటి శక్తివంతమైంది అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. పన్నెండు వేల కిలోమీటర్ల సామర్థ్యం లో దాడి చేయగల సత్తా కలిగిన అగ్ని మిస్సైల్ ను 16 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా సమర్థవంతంగా చేదించే విధంగా ఇక్కడ ఈ మిస్సైల్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్ని మిస్సైల్ పరీక్ష సక్సెస్ అయ్యిందంటే ఇక చైనా కు ధీటుగా ఎదుర్కునేందుకు ఉపయోగపడుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.