మహేష్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ సర్వర్‌పై సైబర్‌ ఎటాక్ విచారణ కొనసాగుతోంది. దీంతో  సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు...  రంగంలోకి దిగారు.  దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.  బ్యాంక్ చెస్ట్‌ ఖాతాలోని 12.4 కోట్ల సొమ్ము ఇతర ఖాతాల్లోకి మల్లించినట్లు గుర్తించిన పోలీసులు...  ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ స్టేషన్ లో  బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు.  సైబర్‌ నేరగాళ్ల కోసం పోలీసులు అన్వేషణ చేస్తున్నారు.   పోలీసుల దర్యాప్తులో  అనుమానిత సైబర్ నేరగాళ్లు ఉన్నారు.    సూపర్‌ అడ్మిన్‌యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ చోరీ చేసి లాగిన్‌అయి, బ్యాంకు చెస్ట్‌ ఖాతాలోని 12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు పోలీసులు. కొందరు స్థానికుల సహకారంతో  సైబర్ చిటర్స్ సిటీలోని  సిద్ధి అంబర్‌బజార్, అత్తాపూర్‌ల్లో ఉన్న మహేష్‌ బ్యాంకుల్లో  మూడు కరెంట్‌ ఖాతాలు తెరిచినట్లు పసిగట్టారు పోలీసులు.


 ఈ హ్యాకింగ్‌ కేసులో నైజీరియన్ల పాత్ర ఉన్నట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి  ఆరా తీస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్‌ క్రై మ్‌ పోలీసులు అదుపులో స్థానికంగా ఖాతాలు తెరిచిన వ్యక్తులు.. స్థానికులను విచారిస్తూ అసలు ప్రధాన సూత్రధారులను గుర్తించే పనిలో వేట కొనసాగిస్తున్నారు పోలీసులు..  ఇప్పటికే నగదు చేరిన ఖాతాల్లో కొన్నింటిని ఫ్రీజ్‌ చేయించారు పోలీసులు.ఫ్రిజ్ చేసిన ఖాతాలో 2 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం అందుతోంది.  బషీర్‌బాగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మహేష్‌ బ్యాంకుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలు ఉన్నాయి. బ్యాంకు అధికారుల ప్రమేయం లేకుండా ఆపరేట్ చేసిన సైబర్ చిటీర్స్...  బ్యాంక్ తెరిచిన మూడు కరెంట్‌ ఖాతాల్లోకి బ్యాంకు చెస్ట్‌ ఖాతా నుండి 12.4 కోట్లు మళ్లించారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రై వేట్‌ కార్యాలయం కేంద్రంగా పని చేస్తున్న బ్యాంక్ ప్రధాన సర్వర్‌ వీటి ఖాతాల నిర్వహణ జరిగినట్లు తెలుస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: