కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓ రగడ నెలకొని ఉంది.దీనికి కొనసాగింపుగా ముద్ర గడ జత కలిశారు.తన గొంతుక వినిపించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పేర్ల విషయమై వివాదం ఉంది. ఆ వివాదాన్ని మరింత పెంచేందుకు ముద్రగడసీన్ లోకి వచ్చారు.తాజాగా అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాకు దివంగత నేత బాలయోగి పేరు పెట్టాలని సూచించారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి ఎనలేని ఖ్యాతి పొందారు. అదేవిధంగా అమలాపురం తో సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. టీడీపీ నేతగా, ఢిల్లీలో కీలక నేతల్లో ఒకరిగా చిర స్థాయిలో కీర్తిని అందుకున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏదో ఒకదానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓ రగడ నెలకొని ఉంది.దీనికి కొనసాగింపుగా ముద్ర గడ జత కలిశారు.తన గొంతుక వినిపించారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు సంబంధించి ఇప్పటికే పేర్ల విషయమై వివాదం ఉంది. ఆ వివాదాన్ని మరింత పెంచేందుకు ముద్రగడసీన్ లోకి వచ్చారు.తాజాగా అమలాపురం కేంద్రంగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాకు దివంగత నేత బాలయోగి పేరు పెట్టాలని సూచించారు. లోక్ సభ స్పీకర్ గా బాలయోగి ఎనలేని ఖ్యాతి పొందారు. అదేవిధంగా అమలాపురం తో సహా పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు. టీడీపీ నేతగా, ఢిల్లీలో కీలక నేతల్లో ఒకరిగా చిర స్థాయిలో కీర్తిని అందుకున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏదో ఒకదానికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు.