ప్రముఖ సామాజిక మాధ్యమాలు అయిన వాట్సాప్,టెలిగ్రామ్ పై మోడీ మార్కు నిషేధం పడింది. వాటిని విరివిగా వాడకూడదని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అస్సలు వాడకూడదని, డేటా ట్రాన్సఫర్మేషన్ కు ఆ యాప్ లను వాడితే అవి మిస్ యూజ్ అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని మోడీ అంటున్నారు. అందుకనే వాటిని వాడకూడదని చెబుతున్నారు. డేటా బదిలీకి గవర్నమెంట్ ఇచ్చి ఇ - గవర్నమెంట్ అప్లికేషన్స్ ను మాత్రమే వాడుకోవాలని మోడీ పదే పదే సూచిస్తున్నారు.ఇప్పటికే విదేశాలకు చెందిన చాలా యాప్స్ కారణంగా దేశంలో ఓ విధం అయిన అభద్రత నెలకొని ఉంది. కనుక దేశ అంతర్గత భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయాలు వెలువరించామని మోడీ అంటున్నారు.
అదేవిధంగా ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆయన వెలువరించారు.ముఖ్యంగా ఆన్లైన్ మీటింగ్ లకు సంబంధించి చాలా మంది ప్రభుత్వాధికారులు జూమ్ ను కానీ గూగుల్ మీట్ ను కానీ ఆశ్రయిస్తున్నారు. ఇవి కూడా శ్రేయోదాయకం కాదని అంటున్నారు మోడీ. అందుకే వీటిపై కూడా తాము నిఘా ఉంచామని చెబుతున్నారు.విదేశాలకు సంబంధించిన యాప్స్ కు బదులు ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్స్ ను కానీ దేశీయ మార్కెట్ లో అందుబాటులో ఉన్న యాప్స్ ను కానీ వినియోగించుకోవాలి సూచిస్తోంది.వాట్సాప్పే కాదు టెలిగ్రామ్ ను కూడా విరివిగా వాడొద్దనే అంటోంది కేంద్రం. వీటి స్థానంలో దేశీయ పరిజ్ఞానంతో రూపొందింప చేసిన, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ - డాక్), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐఎస్) తదితర ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించుకుని దృశ్య సంబంధ భేటీలు (వీడియో మీట్ ) నిర్వహించుకోవాలని మోడీ విన్నవించారు.