రైల్వే కొత్త రూల్స్.. పాటించకుంటే శిక్ష తప్పదు?

రైల్వే శాఖ కొత్త రూల్స్ పెట్టింది. అవేంటంటే..రాత్రిపూట ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా నిబంధనలను మార్చబోతోంది ఇండియన్ రైల్వే. ఎందుకంటే కొందరు రాత్రిపూట నిద్రించే సమయంలో శబ్దం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం తరచుగా మనం చూస్తుంటాం. దీంతో ప్రయాణికులు రాత్రిపూట నిద్రలో ఇబ్బందులు పడుతుంటారు. రాత్రిపూట కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల నిద్రిస్తున్నప్పుడు, కోచ్‌లో ఇతరులతో బిగ్గరగా మాట్లాడటం, బిగ్గరగా సంగీతం వినడం లేదా కాల్‌లో మాట్లాడటం చేస్తుంటారు. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కంపార్ట్‌మెంట్ లోపల, వెలుపల శబ్దం చేయకూడదని రైల్వే ప్రజలకు కఠినమైన సూచనలు చేసింది. దీనికి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు త్వరలో అమలులోకి వస్తాయి. నిబంధనలు పాటించనందుకు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.


కొత్త రూల్స్ ప్రకారం, రాత్రి సమయాల్లో సంగీతం వినడానికి, బిగ్గరగా మాట్లాడటానికి, శబ్దం చేయడానికి లేదా కాల్‌లో బిగ్గరగా మాట్లాడటానికి అనుమతి ఉండదు. ప్రయాణికులు సులువుగా నిద్రపోయేలా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా రైల్వేశాఖ ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ప్రయాణం ప్రశాంతంగా ఉండడంతోపాటు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.అలాగే మరోవైపు, ఎవరైనా ప్రయాణీకుడు మరో ప్రయాణికుడికి ఇబ్బందిని కలిగిస్తే చర్య తీసుకోవడంతోపాటు.. వారికి జరిమానా విధించవచ్చు. 


దీని గురించి మీరు రైలు సిబ్బందికి ముఖ్యంగా టీటీకి ఫిర్యాదు చేయవచ్చు. దీని తర్వాత, ఆ ప్రయాణికుడిపై తక్షణ చర్యలు తీసుకుంటారు.ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి నిద్రించే సమయంలో ఇలాంటి పనులు చేయవద్దని రైల్వే అధికారులు అతనికి మొదటిసారిగా హెచ్చరిస్తారు. అయితే మీరు రాత్రిపూట వీడియో చూస్తున్నట్లయితే.. మీరు ఇయర్‌ఫోన్ వంటి పరికరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.. తద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు.కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్స్ దృష్టిలో పెట్టుకొని పాటించండి. లేదంటే చర్యలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: