రష్యా,ఉక్రెయిన్ ల యుద్ధం కారణంగా వంట నూనెల తో పాటు మరి కొన్ని వనరుల పై ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే..వంట నూనె మరీ దారుణం అనే చెప్పాలి.ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది.వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతులపై రాయితీతో కూడిన దిగుమతి సుంకాల ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.వచ్చే ఏడాది మార్చి చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సేస్ అండ్ కస్టమ్స్ ఆగస్ట్ 31 నుంచి ఈ రాయితీ దిగుమతి సుంకాలను అమలులోకి తీసుకువచ్చింది.
మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్స్ సరఫరా పెరగాలని, దీని వల్ల రిటైల్ ధరలు అదుపులో ఉండాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ గడువును వచ్చే ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.సీబీఐసీ తీసుకువచ్చిన రాయితీతో కూడిన దిగుమతి సుంకాలు ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్పై 2023 మార్చి వరకు కొనసాగుతాయని ఫుడ్ మినిస్ట్రీ తెలిపింది. 'వంట నూనెల దిగుమతులపై కస్టమ్స్ సుంకాలపై రాయితీ ఆరు నెలల పాటు పొడిగించాం. అయితే దీని అర్థం ఇప్పుడు కొత్త గడువు మార్చి 2023 అని ఫుడ్ మినిస్ట్రీ వెల్లడించింద. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.. పామ్ ఆయిల్, ఆర్బీడీ పామోలిన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్పై ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇదే కొనసాగుతుంది. ప్రస్తుతం పామ్ ఆయిల్ క్రూడ్ వెరైటీస్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్పై దిగుమతి సుంకాలు జీరో.
అయితే అగ్రికల్చర్ సెస్ 5 శాతం, సోషల్ వెల్ఫేర్ సెస్ 10 శాతం వంటివి పరిగణలోకి తీసుకుంటే.. ఈ మూడు క్రూడ్ వెరైటీస్పై ఎఫెక్టివ్ దిగుమతి సుంకం 5.5 శాతంగా ఉంటుంది. పామోలీన్, పామ్ ఆయిల్ రిఫైన్డ్ వెరైటీస్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతంగా ఉంది. ఇతర సెస్లు కలుపుకుంటే ఈ సుంకం 13.75 శాతానికి చేరుతుంది. రిఫైన్డ్ సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 17.5 శాతంగా ఉంది. ఇతర సెస్లను కలుపుకుంటే అప్పుడు ఇది 19.25 శాతానికి చేరుతుంది..నూనెల ధరలను తగ్గించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.