ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.కరోనా తర్వాత అందరీలో ముందు జాగ్రత్త పెరిగిపోయింది.దాంతో ప్రతి ఒక్కరూ కూడా పాలసీలను తీసుకుంటున్నారు.లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కోసం ప్లాన్‌ చేసుకుంటున్న వారి కోసం ఒక మంచి ప్లాన్‌ ఉంది. టాటా గ్రూప్‌ అందిస్తోన్న ఈ ప్లాన్‌తో రూ. 10 లక్షల బీమా బీమాదారుడి కుటుంబానికి అందుతుంది. ఇండియా తపాలా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు ద్వారా ఈ పాలసీని పొందొచ్చు.


టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ పేరుతో ఉండే ఈ బీమాను తపాలా శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. అయితే, ఈ బీమా ప్లాన్‌లో ఎంత చెల్లించాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీలో రూ. 399 ప్రీమియం చెల్లించాల్సి ఉంఉటంది. 18 నుంచి 65 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీలో చేరొచ్చు. ఇక ఈ పాలసీ తీసుకోవాలనుకునే వారికి కచ్చితంగా ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉండాలి. బీమా తీసుకోవాలనుకునే వారు నేరుగా పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది.


ఇక ఈ బీమా తీసుకున్న పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వత అంగవైకల్యం వచ్చినా, పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు నామినికీ అందిస్తారు.కాగా, మీకు చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూ. లక్ష ఎడ్యుకేషన్‌ లోన్‌ ఇస్తారు. 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లు చెల్లిస్తారు. 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా బిల్లు ఎంత అయితే అంత ఇస్తారు. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది చెల్లిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్ఠంగా రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. పాలసీదారుడు మృతి చెందితే రూ. 5 వేలు అంత్యక్రియల కోసం అందిస్తారు...ఈ పాలసీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చెయ్యండి..


మరింత సమాచారం తెలుసుకోండి: