కేసీఆర్ ఇప్పుడు జగన్ తో సఖ్యత గా ఉంటే ఉండొచ్చు కానీ కేసీఆర్ అన్ని వేళల నమ్మే అవకాశం లేదు. మాట మార్చడంలో కేసీఆర్ ఏమి తక్కువ తినలేదు. ఇప్పుడంటే జగన్‌ మీద ప్రేమతో పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం 'అభ్యంతరాలు' లేనట్టు పైకి కన్పిస్తున్నా, ఆ ప్రభుత్వం తరఫున.. ఇప్పటికీ కొన్ని కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే వున్నాయి మరి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళడం ఎంతవరకు సబబు.?


తన అవసరాల కోసం ఎలాగైనా ప్లేటు ఫిరాయించగల నైజం కేసీఆర్‌ది. బచావత్‌ ట్రైబ్యునల్‌ లెక్కల ప్రకారం, ఎగురవ రాష్ట్రాలతోపాటు, దిగువ రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులకు అదనంగా, చిట్ట చివరి రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయే జలాల్ని ఒడుపుగా వాడుకోగలిగితే వాటిని వాడుకునేందుకు వీలుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత చిట్ట చివరి రాష్ట్రం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌. కానీ, కేసీఆర్‌ మాత్రం.. ఆ చిట్ట చివరి నీళ్ళపై కన్నేశారు.. అందులో వాటాని ఆశిస్తున్నారాయన. తన మనసులో మాటని కేసీఆర్‌ తాజాగా బయటపెట్టారు కూడా. 


వరదలొచ్చినప్పుడు చిట్ట చివరి రాష్ట్రమే నష్టపోతుంది గనుక.. సముద్రంలో కలిసిపోయే నీటిని వాడుకునేందుకు ఆ చివరి రాష్ట్రానికే వెసులుబాటు వుంటుందిగానీ.. దానిపైనున్న రాష్ట్రానికి వాటా ఎలా వుంటుంది.? ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి స్పష్టత తెచ్చుకోవాల్సి వుంది. లేకపోతే.. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కి భారీ నష్టం తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: