జగన్.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..!
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి.. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. బాబు సర్కార్తో కంటే జగన్ సర్కారుకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోంది. ఒక సోమవారం రోజే... ఏపీ కి అనుకూలంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అవేమిటంటే.. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రం ఒకే చేసింది. దీంతో ప్రాజెక్టు అంచనాలు రూ 55,548 కోట్లకు చేరాయి. అంటే ఈ భారీ మొత్తాన్ని ఏపీ కి ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు.
దీంతోపాటు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. పనిగా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.
అదే సమయంలో కేంద్రం మరో విషయంలో జగన్కు ఝలక్ ఇచ్చింది. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశం తమ పరిశీలనలో లేదని తేల్చి చెప్పేసింది. అంటే ఏపీకి హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్టే.. ఇలా ఒకే రోజు కేంద్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కలగజేసింది.