టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపనలను మహోత్సవంగా నిర్వహించారు. సోమవా రం రాష్ట్రంలోని 29జిల్లాల్లో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు భూమి పూజ చేయగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకను శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్డు వద్ద సమీకృత కలెక్టరేట్ సమీపంలో ఎక రం స్థలంలో టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్‌బాబు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.

 

మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ-దుండిగల్ మండలం డీ పోచంపల్లి పరిధిలోని ఎకరం స్థలంలో నిర్మించనున్న మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయ భవనానికి కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్ రావు, జనార్దన్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.

 

నిజామాబాద్ నగరంలో రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నదారి విఠల్‌రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, ఆకుల లలిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: