ఇంతకు ముందు ఓ లెక్కా..ఇప్పుడు ఓ లెక్కా..వచ్చాడు ఏపికి అసలై పాలకుడు..ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ సొమ్ము తింటూ..ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్న కొంత మంది లంచగొండి నేరగాళ్ల గుండెల్లో నిద్ర పోతానని ఏపి  ప్రజలకు వాగ్దానం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  తన ప్రభుత్వం ఎక్కడ లంచం అడిగినా నేరుగా పై అధికారులకు తెలపండి..అక్కడా పని కాకుంటే నేరుగా వచ్చి నాకే చెప్పండి అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.  


ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం చిక్కింది. రూ.2కోట్ల లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్‌ మల్లికార్జునరావు అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు చిక్కాడు. లబ్ధిదారుడి వద్ద రూ.2కోట్ల లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. వివరాలిలా ఉన్నాయి… లంచం తీసుకుంటూ సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లిఖార్జున రావు ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు.


అయితే స‌దరు అధికారి న‌గ‌దుకు బ‌దులు భూమి రిజిస్ట్రేష‌న్ చేయించుకుంటుండ‌గా ప‌ట్టుకున్నారు. సహకార శాఖ రిజిస్ట్రార్ మల్లిఖార్జున రావు త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన ఓ వ్య‌క్తి నుంచి రూ.2కోట్లు లంచం డిమాండ్ చేశాడు. అదీ న‌గ‌దు రూపంలో కాకుండా భూమి రిజిస్ట్రేష‌న్ కి ఒప్పందం చేసుకున్నారు. బాధితుడి స‌మాచారంతో ఏసీబీ అధికారులు విశాఖ టర్నర్ ఛౌల్ట్రీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూ రిజిస్ట్రేషన్ సమయంలో వలపన్ని పట్టుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: