సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా తెలుగుదేశం పార్టీని బతికించలేరని కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే వార్తలను తాను కూడా విన్నానన్నారు నాదెండ్ల.


జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పై ఎన్టీఆర్ కుటుంబసభ్యులే నిర్ణయం తీసుకోవాలన్నారు నాదెండ్ల భాస్కర్‌రావు. అసలు తనకు జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని.. అంతేకాదు తాను సినిమాలు చూడనని అంటున్నారు నాదెండ్ల భాస్కర్ రావు. ఓవైపు టీడీపీ ఘోరపరాజయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నవేళ.. నాదెండ్ల కామెంట్స్ ఆసక్తిరేపుతున్నాయి.


ఇన్నాళ్లూ కాంగ్రెస్ లో ఉండీ లేనట్టుగాఉన్న నాదెండ్ల.. తాజాగా బీజేపీలో చేరారు. అయితే ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేనలోనే ఉన్నారు. ఈ విషయంపై స్పందిస్తూ... నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీలో ఉండాలా ? వద్దా ? అనే విషయంపై ఆలోచిస్తున్నారన్నారు.


మనోహర్ జనసేన పార్టీలో చేరడం ఒక తప్పిదం అని చెప్పుకొచ్చారు. జనసేన గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని.. ఇప్పుడు కూడా ఆ పార్టీపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని నాదెండ్ల అంటున్నారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు నాదెండ్ల.


మరింత సమాచారం తెలుసుకోండి: