భారత దేశం ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్ తో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అయన మాస్టర్ ప్లాన్ ఆంధ్ర రాష్ట్రంపై ఉంది, అందుకే కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదు, బడ్జెట్ లోను ఆంధ్రకు మొండి చెయ్యి చూపించారు, ఆంధ్రాలో ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి జాతీయ పార్టీలను బలోపితం చెయ్యడమే నరేంద్ర మోదీ అద్భుతమైన మాస్టర్ ప్లాన్. ఈ రెండేళ్లు ఆంధ్రని ఎండకట్టి తరువాత వాళ్లకు ఆ నీళ్లు ఇచ్చి ఆంధ్ర రాజ్యంలోకి రావాలని మోదీ ప్లాన్. 


అందుకే గత 5 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా గొడవ పెట్టుకొని, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో స్నేహ పూర్వకంగా ఉన్న అయన తలను మరో మూడేళ్ళలో తడిగుడ్డతో కొయ్యలని ప్లాన్ వేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని, ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీను పిల్లులను చేసి నరేంద్ర మోదీ మాస్టర్ ప్లాన్ తో ఆట ఆదుకుంటుంన్నాడు. మరో 5 ఏళ్ళల్లో వైసీపీ, టీడీపీ రెండిటిని అధికారం నుంచి దించి ఆంధ్రాలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది. 


వైసీపీ, టీడీపీ పార్టీలు రెండు పిల్లుల ఒక రొట్టె ముక్క కోసం కొట్టుకుంటుంటే, అది చుసిన బీజేపీ పార్టీ కోతి 'మంచిగా నటిస్తూ రొట్టెను ఎత్తుకుపోయినట్టు, వైసీపీ, టీడీపీ ఆంధ్ర అధికారం కోసం కొట్టుకుంటుంటే, బీజేపీ వచ్చి ఆంధ్ర అధికారాన్ని పట్టుకుపోయేలా మోదీ పక్క ప్రణాళిక వేశారని, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు నిజమనిపించేలా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఇంచార్జి 'సునీల్ దేవ్ ధర్' ఓ మీడియాతో మాట్లాడుతూ '' చంద్రబాబు త్వరలో జైలుకు పోతారని, తర్వాత బీజేపీ పార్టీనే ప్రతిపక్ష పార్టీ'' అని చెప్పిన సంచలన వ్యాఖ్యలు ఆ పుకార్లకు తోడవుతున్నాయి. మరి ఈ వార్తలు నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: