తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి  రెండేళ్లలో జైలుకు వెళ్లక తప్పదా ? అంటే అవుననే అంటున్నారు  బిజెపి నేత సునీల్ దేవధర్.  చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న ఆయన, చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేపట్టాల్సిన భాధ్యత వైఎస్ జగన్ ప్రభుత్వంపై వుందని దేవధర్ అన్నారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండేళ్ళలో జైలుకెళ్తారని అన్నారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని జగన్ ఖాళీ చేయిస్తే ఆ ఇంటిని వదిలి చంద్రబాబు వెళ్ళేది జైలుకేనని ఆయన వ్యాఖ్యానించారు .


 కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారని, ఏపీలో ఎన్టీఆర్ బాహుబలిలా వుంటే చంద్రబాబు కట్టప్పలా వెనుక వుండి వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. చంద్రబాబు.. చందాలబాబులా మారారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే,  ఆ నిధులలో  చంద్రబాబుఅవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చాలా మంది టీడీపీ నేతలు మాతో టచ్‌లో ఉన్నారని దేవ్‌ధర్‌,  టీడీపీ నేతలు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారని  చెప్పారు .


 చంద్రబాబు అభివృద్ధి నిధుల్లో అవినీతికి పాల్పడ్డారని చెబుతోన్న దేవధర్ , ఎందుకనీ జగన్ సర్కార్ ను విచారణ చేపట్టాలని కోరుతున్నారో అర్ధం కావడం లేదు ... కేంద్రం లో ఉన్నది తమ ప్రభుత్వమే కదా, నేరుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల తరుపున విచారణ జరిపించి , ఆయన చేసిన  అవినీతిని నిగ్గు తేల్చి జైలుకు పంపవచ్చు కదా అన్న వ్యాఖ్యలు రాజకీయ పరిశీలకుల నుంచి విన్పిస్తున్నాయి .  టీడీపీ నేతలు అంత మంది టచ్ లో ఉన్నారు ... ఇంతమంది ఉన్నారని చెప్పడమే కానీ ఇంతవరకు ఎవరున్నారో, వారి పేర్లు బయటపెట్టే సాహసాన్ని బీజేపీ నాయకత్వం మాత్రం చేయడం లేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: