ఇప్పటికే స్టార్ నటులు చాలా మంది కమలం పార్టీలో చేరారు.  గత ఎన్నికల్లో చాలామంది నటులు ఆ పార్టీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు.  ఎన్నికలు పూర్తయ్యి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా బీజేపీలో చేరే సెలెబ్రిటీల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.  


తాజాగా హర్యానా రాష్ట్రం నుంచి సప్నా చౌదరి ఢిల్లీలో బీజేపీలో జాయిన్ అయ్యింది.  సప్నా చౌదరి ఎవరు అనే విషయం సౌత్ ప్రజలకు తెలియకపోయినా నార్త్ లో ముఖ్యంగా హర్యానాలో అందరికి బాగా తెలుసు. ఆమె డ్యాన్స్ అంటే అందరు పడిపోతారు.  సప్నా డ్యాన్స్ ఉంది అంటే చాలు జనాలు కళ్లప్పగించి చూస్తుంటారు.  


ఈనెల 6 వ తేదీకి నుంచి కార్యకర్తల చేరిక కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ సందర్భంగా ఈ రోజు ఢిల్లీలో కార్యకర్తల చేరిక కార్యక్రమం జరిగింది.   ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో డ్యాన్సర్ స్వప్న చౌదరి కమలం పార్టీలో చేరింది.  


స్వప్న చౌదరి గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి.  ప్రియాంక గాంధీతో సప్నా చౌదరికి మంచి అనుబంధం ఉంది.  కానీ, సప్నా చౌదరి కాంగ్రెస్ ను కాదని బీజేపీలో చేరింది.  ఇది మంచి పరిణామం అనే చేప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: