నటుడు శోభన్ బాబు మరణించి పదకొండు సంవత్సరాలు గడుస్తోంది. ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా శోభన్ కి బ్రాండ్ ఇమేజ్  సంపాదించుకున్నారు. మంచి నటుడుగా ఫ్యామిలీ హీరోగా జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారు. శోభన్ బాబు హీరోగా  యాక్షన్ మూవీస్ కూడా కొన్ని చేశారు.  కానీ ఆయన ఎక్కువగా చేసినవి ఫ్యామిలీ మూవీసే.


ఇదిలా ఉండగా శోభన్ బాబు తో అల్లూరి సీతారామరాజు మూవీని తీయలాని అప్పట్లో క్రిష్ణతో సినిమాలు చేసే డీ ఎల్ నారాయణ అనే  నిర్మాత ఆలోచన చేశారట. నిజానికి అల్లూరి సినిమా ఆలోచన  క్రిష్ణ దగ్గరకు అలా వచ్చింది. ఆ సినిమాను తాను శోభన్ తో తీయాలనుకుంటున్నట్లుగా డీ ఎల్ క్రిష్ణతో చెప్పారట. ఆ తరువాత అనేక కారణాల వల్ల ఆ మూవీ ఆయన తీయలేకపోయారట.


దాంతో క్రిష్ణ తనతో ఆ మూవీ తీయమని అడిగినపుడు డీ ఎల్ తనకు ఆర్హ్దికంగా ఇబ్బందులు ఉన్నట్లుగా చెప్పడంతో క్రిష్ణ సొంతంగా ఆ సినిమాను తీసి భారీ హిట్ కొట్టారు. నిజానికి అల్లూరి అంటే మనకు కళ్ళ ముందు క్రిష్ణ మాత్రమే కనిపిస్తారు. అంతలా చెరగని ముద్ర వేశారు క్రిష్ణ. ఇదిలా ఉండగా శోభన్ తో అల్లూరి సినిమా అన్న కొత్త విషయాన్ని లేటెస్ట్ గా క్రిష్ణ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. నిజానికి ఇది సినిమాల మీద అవగాహన ఉన్న వారందరికీ షాక్ ఇచ్చే వార్తే.



మరింత సమాచారం తెలుసుకోండి: