తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు జోరుగా ఉంటాయంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నా.. టీడీపీ ఎంపీలు తప్ప ఇంత వరకూ చెప్పుకోదగ్గ నేతలు పెద్దగా బీజేపీలోకి చేరింది లేదు. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం మాతో చాలామంది టచ్ లో ఉన్నారు.. టీడీపీ ఖాళీ అవుతోంది.. అంటూ ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు.


ఇదే తరహాలో పశ్చిమగోదావరి జిల్లాలో పైర్ బ్రాండ్ గా పేరొందిన ఒక టిడిపి నేత బిజెపి లో చేరే అవకాశం ఉందని టిడిపి మీడియాలోనే వార్త వచ్చింది. గత నెల రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేల్లో కొందరు ఆకస్మికంగా పార్టీ మారేందుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోందట.


వీరిలో ఒక మాజీ జిల్లాలో ఫైర్‌ బ్రాండ్‌గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పార్టీ మారడం ఖాయం అని కొంప్రచారం చేస్తున్నారు. మరి ఇదంతా ప్రచారామమా లేక.. నిజంగానే టీడీపీ నేతలు పార్టీ మారతారా అన్నదానిపై క్లారిటీ లేదు.


మరోవైపు టీడీపీ మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావు బిజెపిలో చేరబోతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ.. ఆయన టీడీపీలోనే ఉంటారంటూ పార్టీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: