తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమవైపు తిప్పుకునే కార్యక్రమానికి బీజేపీ నాయకత్వం శ్రీకారం చుట్టిందా ? అంటే  అవుననే ఆ పార్టీ వర్గాల నుంచి సమాధానం విన్పిస్తోంది .టీడీపీ కి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమతో టచ్ లో ఉన్నారని కమలనాథులు పదే , పదే చెబుతున్న విషయం తెల్సిందే . ఇప్పటికే టీడీపీ రాజ్యసభ సభ్యులను తమపార్టీలోకి లాక్కొన్న బీజేపీ , ఇప్పుడు ఎమ్మెల్యేలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది .


దానిలో భాగంగానే ఏపీ పర్యటన లో ఉన్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది .  వల్లభనేని వంశీ మోహన్ ను మాజీ మంత్రి మాణిక్యాలరావు తీసుకువెళ్ళి కిషన్ రెడ్డికి కల్పించినట్లు సమాచారం . అయితే వీరిద్దరి మధ్య ఏమి చర్చ జరిగిందన్నది హాట్ టాఫిక్ గా మారింది . అయితే వల్లభనేని వంశీ కేవలం మర్యాదపూర్వకంగానే హోం శాఖ సహాయమంత్రి ని కలిశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి .


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ సభ్యులు నిర్వహిస్తోన్న స్వర్ణభారతి ట్రస్ట్ వేడుకలకు కిషన్ రెడ్డి హాజరుకాగా , వెంకయ్య కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం ఉన్న వంశీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యార ని అంటున్నారు . రాజాకీలకతీతంగానే వీరిద్దరూ కలుసుకుని మాట్లాడుకోవడం జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు . కిషన్ రెడ్డి తో వంశీ ఉన్న ఫొటో ను బీజేపీ నాయకత్వం మైండ్ గేమ్ లో భాగంగానే  సోషల్ మీడియా లో వైరల్ చేయించి టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురి చేస్తోందని మండిపడుతున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: