నారా లోకేష్ అసలు ఎం మాట్లాడుతున్నాడు, లోకేష్ ని ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని అంటున్నారు నెటిజన్లు. ఉదయం లేచినప్పటి నుంచి ట్విట్టర్ లో 'వైసీపీ'పై ఒకటే విమర్శలు చేస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్. అస్సలు ఎందుకు అయ్యా ఇన్ని ట్విట్లు చేస్తున్నావ్, ఏమి సాధించాలి అనుకుంటున్నావు లోకేష్ బాబు అని టీడీపీ అభిమానులు సైతం ట్విట్టర్ వేధికగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు కోపం తెప్పించేలా అయన మాటలు ఉంటున్నాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 


ఉదయం నారా లోకేష్ ట్విట్ చేస్తూ ''అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల, తూటాలతో రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చినందువల్ల దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆ రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది. కాలమహిమ !'' అని అయన ట్విట్ చేసారు. వైఎస్ఆర్ అంటేనే రైతు రాజ్యం. రైతులకు ఎంత మంచి చేసాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. రైతే రాజు అనే నినాదాన్ని నమ్ముకొని పని చేసిన పెద్దాయనను ఇలా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. 


అందుకే నెటిజన్ల నారా లోకేష్ ని మాములుగా తిట్టడం లేదు, అస్సలు ఎం మాట్లాడుతున్నావ్ అయ్యా అని టీడీపీ అభిమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు పగ పట్టిన పాములు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాయట.. నారా లోకేష్ ట్విట్ మాటలు మీకోసం ''వర్షాకాలంలో పాములు బైటికొచ్చి భయపెడుతున్నాయని పత్రికల్లో రాస్తున్నారు. కానీ ఏపీలో ఏకంగా పగపట్టిన పాములే రాజ్యమేలుతున్నాయి. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేఖరులపై పగదీర్చుకుంటామని ఈయన విలేఖరుల సంఘ సమావేశంలోనే, వైసీపీ ఎమ్మెల్యే సాక్షిగా ఎలా బెదిరిస్తున్నారో చూడండి''. అంటూ ట్విట్ చేసాడు. ఒక్క నెల చేసిన పాలనే ఇలా అంటే 5 ఏళ్ళ చంద్రబాబు గారి పాలనను ఎం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: