మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యం తీసుకొస్తానని రైతుల కోసం రాజ్యం అని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వైఎస్ జగన్ రైతులను రోడ్లు ఎక్కించారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగాడు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో ఈరోజు చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.


రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని రాజన్న రాజ్యం నేడు రైతు దినోత్సవం చెయ్యడం హాస్యాస్పందంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. రైతు విత్తనాలు అడిగితే అన్యం పుణ్యం ఎరుగని రైతులకు పోలీస్ లాఠీ దెబ్బల రుచి చూపించాడు యూయూఎస్ జగన్ అని విమర్శించాడు మాజీ ముఖ్యమంత్రి. రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వాఖ్యలపై వైసీపీ నాయకులూ మండిపడుతున్నారు. 


తండ్రి కొడుకులు వైఎస్ జగన్ ను విమర్శించడమే మీ పనిగా పెట్టుకున్నారా ? లేక మీరు చెయ్యలేని రాజన్న పరిపాలనను, వైసీపీ చేస్తుందనే కుళ్లుతో విమర్శలు చేస్తున్నారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొందరు అస్సలు మీ వల్లే కదండీ ఈసారి రైతులకు సమయానికి విత్తనాలు అందలేదు, ఎందుకండీ ఈ విమర్శలు చేసి మీ గొయ్యి మిరే తొవ్వుకుంటున్నారు అంటూ మరికొందరు నెటిజన్లు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: