ట్వట్టర్ లో అనేక విషయాలపై రెచ్చిపోతున్న నారావారి పుత్రరత్నం నారా లోకేష్ కరకట్ట మీద నివాసం ఉంటున్న అక్రమ నిర్మాణంపై మాత్రం నోరిప్పటం లేదు. తండ్రి చంద్రబాబునాయుడుతో పాటు తాను కూడా నివాసం ఉంటున్న లింగమనేని అక్రమనిర్మాణంపై కొద్ది రోజులుగా జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే.

 

సిఎంగా ఉన్నపుడు చంద్రబాబు చేసిన తప్పిదాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఖాతాలో వేయటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న లోకేష్ తాముంటున్న అక్రమనిర్మాణం గురించి మాత్రం ఎందుకు మాట్లాడటం లేదు ? కరకట్టపై తాముంటున్న అక్రమనిర్మాణం ఎవరిదో కూడా స్పష్టంగా చెప్పలేని స్ధితిలో పడిపోయారు తండ్రి, కొడుకులు.

 

అక్రమనిర్మాణం కాబట్టి సదరు గెస్ట్ హౌస్ ను కూల్చేయాలని జగన్ ప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చేసినట్లే. ప్రజావేదికనే కూల్చేసిన ప్రభుత్వం ప్రైవేటు నిర్మాణాన్ని ఎందుకు ఉపక్షేస్తుంది. తాజాగా ఆ గెస్ట్ హౌస్ ప్రైవేటు ప్రాపర్టీ అని చెబుతున్న చంద్రబాబు అండ్ కో 2016లో అసెంబ్లీ ఆ గెస్ట్ హౌస్ ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్నట్లు చెప్పారు.

 

చూడబోతే చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే గెస్ట్ హౌస్ పై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. రాష్ట్రంలోని అనేక అంశాలపై ట్విట్టర్లో స్పందించేస్తున్న లోకేష్ తాముంటున్న అక్రమనిర్మాణంపై కూడా నోరిప్పితే బాగుంటుంది కదా ? నిజంగా లోకేష్ గనుక నోరిప్పితే విషయం మరింతగా రచ్చ అవుతుందని చంద్రబాబే కొడుకు నోరు మూయించేస్తున్నట్లు కనబడుతోంది.


 

 


మరింత సమాచారం తెలుసుకోండి: