గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపొంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు పదవిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ప్రవేశ పెట్టిన ముఖ్యమైన పథకాల్లో అన్నా క్యాంటిన్లు ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నో కొత్త పథకాలు తీసుకు వస్తున్నారు.
తాజాగా రాజన్న క్యాంటిన్ కూడా అందుబాటులోకి తెస్తున్నారు. తాజాగా ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నివాసం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ సోమవారం నుంచి మూతపడింది. ఎన్నికల ముందు వరకు ఈ క్యాంటీన్కి చక్కని ఆదరణ లభించింది. అప్పట్లో చంద్రబాబు కి వినతులు సమర్పించడానికి వచ్చిన వారు ఇక్కడే ఎక్కువగా బసచేసి బోజనం చేసేవారు.
ఇటీవల కాలంలో ఇక్కడికి వచ్చే ప్రజల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో.. భోజనం చేసేవారి సంఖ్య కూడా తగ్గింది. కనీస సంఖ్య కూడా క్యాంటీన్ కి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి క్యాంటీన్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.